పార్శ్వ తల నొప్పి
మొదటి చిట్కా:
1. అర లీటరు నీళ్ళల్లో , 60గ్రా పటికబెల్లం వేసి, రాత్రి పడుకునే ముందు ఆ చెంబు ని, మంచం కింద పెట్టాలి, పొద్దున 5.00 గంటలకు లేచి, పళ్ళు తోముకుని, ఈ నీళ్ళని త్రాగాలి.
రెండవ చిట్కా:
1. కరక్కాయ పొడి ---- 100 గ్రా
2. తానికాయ పొడి ----- 200 గ్రా
3. ఉసిరికాయ పొడి ----- 400గ్రా
4. పటికబెల్లం పొడి -- 700 గ్రా
నోట్: కరక్కాయలని, 4 చుక్కలు నాటు ఆవు నెయ్యి వేసి, దోరగా వేయించి పొడి చేసుకోవాలి. తాని కాయలను కూడా , 4 చుక్కలు నాటు ఆవు నెయ్యి వేసి, దోరగా వేయించి పొడి చేసుకోవాలి.
ఉసిరి కాయలను మాత్రం ఎండబెట్టి పొడి చేసుకోవాలి.
తయారీ విధానం:
ఈ పొడులన్నీ కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి, ఉదయం పరగడుపున, రాత్రి నిద్రపోయేముందు, పిల్లలకి పావు టీ స్పూను, పేదవాళ్లు అర టీ స్పూను పొడిని తిని, గోరు వెచ్చని నీళ్లు త్రాగాలి.
పార్శ్వ తలనొప్పి శాశ్వతం గా తగ్గిపోతుంది.
No comments:
Post a Comment